పల్లె దవాఖాన ప్రారంభించిన: మంత్రి కెటిఆర్..
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్రూం, సరస్వతీ విగ్రహ వేదిక, పల్లె దవాఖాన ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు.. ఈ సందర్భంగా డిజిటల్ క్లాస్రూం లో విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి, విద్యార్థులను అభినందించిన మంత్రి..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్న పెంచ లేక పోయామని తెలంగాణ ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే ఆశా వర్కర్ల కు వేతనాలు పెంచుతామని కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్ల సేవలు వెలకట్ట లేనివని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసిఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు..