పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
బిజెపి ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు.. ఆర్మూర్ లో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ బిజెపి ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పండించిన పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు ఆందోళనలో ఉన్నారని, పసుపుకు గిట్టుబాటు ధర కల్పించి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. పసుపు రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఇప్పటికైనా ఎంపీ అరవింద్ రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ప్రాంత రైతులు, రైతు సంఘం నాయకులు భూమన్న, తదితరులు పాల్గొన్నారు.