పాఠశాల భవనానికి భూమి పూజ
యదార్థవాది ప్రతినిది వేములవాడ
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతల(CSR) నిధుల నుండి రు. 5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ ఉన్నత పాఠశాల సముదాయాల భవనానికి భూమి పూజ చేసిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి..ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్య నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి రాధకిషన్, జడ్పీటిసి లు, ఎంపీపీలు, కౌన్సిలర్స్, సెస్ డైరెక్టర్లు, పాక్స్ చైర్మన్లు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.