పోలీసు పహార మధ్య గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పనులు!
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట నిర్మాణం పనులు శుక్రవారం అర్ధరాత్రి నుండి ప్రారంభించిన అధికారులు.. నిర్వాసితులు పనులు అడ్డుకోకుండా ఉండేందుకు గుడాటిపల్లిలో పోలీసులు అర్థరాత్రి నుండే భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసుల పహార మధ్య కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత స్వయంగా పర్యావేక్షిస్తునట్లు తెలుస్తుంది. గుడాటిపల్లి నుండి ఎవరిని కూడా కట్టవైపు ప్రజలను, మీడియాకు కూడా అనుమతించడం ఇవ్వడం లేదు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు చేస్తుండడం పట్ల గ్రామంలోని మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తు, పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిర్వాసితులు. గ్రామపంచాయతీ వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నారు. రామవరం రోడ్డు కట్ట మూసివేత పనులు పూర్తయితే గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు పూర్తయినట్లే అవుతుంది…