పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి
మెదక్ యదార్థవాది ప్రతినిది
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేశారు ఈ కార్యక్రమంలో రేగోడ్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ రెడ్డి తన కుమారుడు కాంట్రాక్టర్ గా పని చేయుటకు తన పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటేనే జాబ్ ఇస్తారని నన్ను నమ్మించి నేను కొనుగోలు చేసిన 7 ఎకరాల భూమిని నా కొడుకు భవిష్యత్తు కొరకు ఆలోచించి వారి పేరుపై చేయించినానని అంతేకాక కొంత నగదు కూడా ఇచ్చినానని, నేను ఇచ్చినటువంటి భూమిలో నుండి నాకు తెలియకుండా 2 ఎకరాల భూమిని అమ్మివేసినాడని నాకు ఏవిదమైన బ్రతుకు తెరువు లేక నా భార్యా పక్షవాతంతో, నేను గుండె నొప్పితో బాదపడుతూ కుటుంబ పోషణకు కొరకు ఆదారం లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నామని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రేగోడ్ ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే మాసాయిపేట గ్రామానికి చెందిన రేణుక తన గ్రామానికే చెందిన పాపని సత్యనారాయణకు తేదీ:12.09.2018 లో 2,50,000/- రెండు లక్షల యాభై వేల రూపాలను అప్పుగా ఇచ్చామని ఇట్టి అప్పు వారం రోజుల్లో తిరిగి ఇస్తానని అనడంతో ఇచ్చామని ఆ తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ డబ్బులు ఇవ్వడం లేదని ప్రతుత్తం తన భర్త ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రి ఖర్చులకి కూడా డబ్బులు లేవని కావున పైన తెలిపిన వ్యక్తి పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి ఐ కి గారికి ఆదేశించారు