20.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణప్రగతి భవన్ లో గోదాదేవి కళ్యాణం..

ప్రగతి భవన్ లో గోదాదేవి కళ్యాణం..

ప్రగతి భవన్ లో గోదాదేవి కళ్యాణం..

హైదరాబాద్:13 యదార్థవాది ప్రతినిది

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దంపతుల ఆధ్వర్యం లో..ప్రగతి భవన్ లో ఘనంగా గోదాదేవి కళ్యాణం.. పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు శోభమ్మ దంపతుల ఆధ్వర్యం లో ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగ కొనసాగింది. హిందూ సంప్రదాయం ప్రకారం..ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం గారి సోదరీమణులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్