34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రగాల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రగాల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రగాల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్

యదార్థవాది ప్రతినిది దుబ్బాక

మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ప్రగాల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితుల వంద కోట్లు ఎం చేశారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హాత్ సే హాత్ జోడో, దుబ్బాక ఆత్మ గౌరవ పాదయాత్రలో భాగంగా మూడవ రోజు తొగుట మండలం ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్ గ్రామంలోని ప్రజల్ని కలుస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆరేళ్లుగా నిర్వాసితులకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా మల్లన్న సాగర్ ప్రారంబోత్సవంలో మహా అంటే వంద కొట్లే కదా ఇచ్చేయండి అని తేలికగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకెప్పుడు పూర్తి పరిహారాలు ఇస్తారని అన్నారు. మూడో టిఎంసి భూసేకరణ సమయంలో అప్పటి కలెక్టర్, ఎమ్మెల్యే లు తుక్కాపూర్ గ్రామ నిర్వాసితులకు 200 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి సభ అనంతరం ఎంపి, సైతం హామీ ఇచ్చారని పోటా పోటీగా పాలాభిషకాలు చేసి గ్రామస్థులను మోసం చేశారని విమర్శించారు. ఏ తెలంగాణ కోసం యువకులు, సబండ వర్గాల, ప్రజలు చేసిన పోరాటం అంత వృధా అయిపోయిందని, ఉద్యోగాలు రాక చదువుకున్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని, అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రాంతం వివక్షకు లోనయిందని, ఓటు వేసేటప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుని ఎన్నుకొని అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన ప్రజల్ని కోరారు, మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణంలో సర్వం కోల్పోయి ఎలాంటి ప్రత్యాన్మయాం చూపకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వంతో పోరాడి నిర్వాసితులకు న్యాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, కొంగరి నరసింహులు మైపాల్ రెడ్డి, విజయ పాల్ రెడ్డి సీనియర్ నాయకులు శ్రీనాకర్ రెడ్డి, రేపక తిరుపతి, రమేష్, శ్రీనివాస్ గౌడ్, ఉప్పలయ్య, లింగాల కృష్ణ, బాల్ రెడ్డి, విష్ణు, బర్రెంకల స్వామి, గోపాల్, చిక్కుడు స్వామి, బొంబాయి ఎంకటి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్