ప్రజలకు అందుబాటులో సర్కారు వైద్యం
యదార్థవాది ప్రతినిధి వరంగల్
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు 15వ తేదీన గిరిప్రసాద్ నగర్,క్రిస్టియన్ కాలనీ నూతనంగా ఏర్పాటు చేసుకున్న బస్తి దవాఖానలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రు ఎర్రబెల్లి దయాకరరావు హాజరై ప్రారంభించనున్న నేపధ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ గోపి, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు,చింతాకుల అనిల్,భోగి సువర్ణ సురేష్ ఇతర కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.