24.1 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణప్రజల వద్దకే ఆర్టీసీ బస్

ప్రజల వద్దకే ఆర్టీసీ బస్

ప్రజల వద్దకే ఆర్టీసీ బస్

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని మంగళవారం ధర్పల్లి మండలం దుబ్బాక్ గ్రామంలో ఆర్మూర్ డిపో ఎస్ టి ఐ పారు. నిర్వహించినారు.. ఈ సందర్భంగా ఎస్ టి ఐ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు బస్ పాస్ రాయితీలు కల్పిస్తుంది దివ్యాంగులకు 50 శాతం రాయితీ కల్పిస్తుందని, తిరుపతి ప్రయాణికులకు తిరుమల దర్శనం టోకెన్స్ అందుబాటులోకి తెచ్చిందని,
వేములవాడ శివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, ఆర్మూర్ నియోజకవర్గంలో గ్రామాల భక్తులు ఎక్కువ గా ఉంటే, ఆ గ్రామం నుండి వేములవాడ రాజన్న దర్శనానికి బస్ సర్వీసులు నడిపిస్తామని తెలిపారు. భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగంకోవాలని, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మరింత చేరువ కావడానికి బస్ ట్రాకింగ్ సిస్టం పెట్టిందని, పెండ్లిలకు శుభకార్యాలకు ఎటువంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీతోని అద్దె బస్సులను బుకింగ్ చేసుకోవచ్చుని, సీజన్ టికెట్ లో 20 రోజుల ప్రయాణం చార్జీలు చెల్లించి 30 రోజులు ప్రయాణించవచ్చని, ప్రతి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా 24 గంటలు కార్గో సేవలను అందిస్తుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్