ప్రజా గోస బిజెపి భరోసా
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫిబ్రవరి 10 నుండి 25 వరకు జిల్లాలోని అన్ని నియోజకర్గాల్లోనీ గ్రామాలలో ప్రజా గోస బీజేపీ భరోసా లో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ను ప్రజల్లోకి తీసుకెళ్లి, కేంద్రం లోని నరేంద్రమోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు