ప్రతిపక్షాల వలలో పడొద్దు: మంత్రి హరీష్
- సమ్మె వీడి.. విధుల్లో చేరండి.. కార్మికులను అన్ని విధాలుగా అండగా ఉంటా..
- క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి గా చేస్తాం..
- రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..
సిద్ధిపేట యదార్థవాది
తెలంగాణ రాష్ట్రం కురుస్తున్న వర్షల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపించి గ్రామాలలోని ప్రజలకు అంటువ్యాధులు పెరిగే అవకాశం వుందని, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని, గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులంతా సమ్మె వీడి విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు పారిశుద్ధ్య కార్మికులను కోరారు..ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని, ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మీతో చర్చలు జరుపుతరని, వీలైనంత వరకూ కార్మికుల సమస్య తీరుతుందని పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఎక్కువగా ఇస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కనీసం మనుషులుగా కూడా ఆ ప్రభుత్వాలు చూడట్లేదని ఉత్తర ప్రదేశ్ లో 5 వేల 200, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 5 వేల 200, ఛత్తీస్గఢ్ లో అసలు ప్రభుత్వం వేతనం ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీలే తోచినంత ఇస్తున్నాయని, ఒరిస్సాలో ఇంటికి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, పశ్చిమ బెంగాల్ లో అయితే “పెయిడ్ వర్కర్స్” అని పెట్టి నెలకు కేవలం 500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, కేరళ శానిటేషన్ వర్కర్లు పెట్టి ఇద్దరికీ ఇంటికి కేవలం 30 రూపాయలు ఇస్తున్నారని, అంటే ఒక కార్డులో పని చేస్తే కనీసం 4 నుంచి 5 వేలు కూడా రాని పరిస్థితి ఉన్నదని అన్నారు. పనికి మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని సీఏం కేసీఆర్ మిమ్మల్ని చల్లగా చూస్తారని, ఏలాంటి సమ్మెలు, ధర్నాలు చేయవద్దని, రాబోయే రోజులలో క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి గా చేయాలని సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని అయన అన్నారు.