34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రతీ ఒక్కరు స్వచ్ఛత వైపు నడవాలి..

ప్రతీ ఒక్కరు స్వచ్ఛత వైపు నడవాలి..

ప్రతీ ఒక్కరు స్వచ్ఛత వైపు నడవాలి..

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛంజలి స్వచ్ఛభారత్ నినాదంతో స్థానిక పాత బస్టాండ్ వద్ద చెత్తను తీసి రోడ్డు వుడ్చిన జిల్లా నాయకులు కార్యకర్తలు… సిరిసిల్ల జిల్లా పట్టణంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛంజలి స్వచ్ఛభారత్ 2.0 కార్యక్రమం పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రెటరీ రెడ్డబోయిన గోపి, ఆడేపు రవీందర్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ నేడు గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛత వైపు పయనిస్తూ స్వచ్ఛ సర్వేక్షలో పోటీ పడుతున్నాయి.. ఎందుకు నిదర్శనమే కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తూ పోటీ తత్వాన్ని నేర్పిస్తుందని అందువల్ల ప్రజలు స్వచ్ఛత వైపు నడుస్తూ గ్రామాలను పట్టణాలను అభివృద్ధిలో మందుకు సాగుతున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల వేణు, సుంచు ప్రకాష్, గాజుల సదానందం, తడుక విజయ్, గుండెల్లి వేణు, చొప్పదండి శ్రీనివాస్, పోతూ శ్రీనివాస్, నరహరి, మురళి, వంశీ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్