ప్రదాని మోదీ తల్లి అంత్యక్రియలు
గుజరాత్ 30 డిసంబర్
ముగిసిన హీరాబెన్ మోదీ అంత్యక్రియలు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పది గంటల జరిగాయి. సోదరులతో కలిసి మోదీ.. చివరిసారి తల్లి పాదాలకు నమస్కరించి, చితికి నిప్పంటించారు. అంతకుముందు గాంధీనగర్ లో హీరాబెన్ పార్థీవదేహాన్ని తరలించే వాహనం వరకు ప్రధాని మోదీ తల్లి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో ఎక్కి తల్లి అంతిమయాత్రలో పాల్గొన్నారు..