ప్రయాణంలో తగు జాగ్రత్త..మంచిది
హైదరాబాద్: 13 యదార్థవాది ప్రతినిది
* వేగం వద్దు ప్రాణం ముద్దు..
సంక్రాంతి దగ్గర పడడంతో స్వంత గ్రామాలకు ప్రయాణాలు పెరిగాయి..చాలామంది సొంత వాహనాల్లోనే వెళుతున్నారు. సమయం కలిసి వస్తుందని రాత్రివేళ వెళ్లేవారే ఎక్కువమంది ఉంటారు. అసలే చలికాలం.. ఆపై దట్టమైన పొగమంచు.. ఉదయం 10 గంటల వరకూ వీడని మంచుతెరలు.. వీటి మాటున రోడ్డు ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచు కారణంగా ఎదురుగా ఏముందో కనిపించక రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలను, డివైడర్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. పొగమంచుతో రాష్ట్రంలో నిత్యం మూడు నాలుగైనా ప్రమాదాలు జరుగుతుండగా.. నెలకు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువగా అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాములోపు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.