ప్రశాంతంగా ముగిసిన సింగరాయ జాతర..
కోహెడ: యదార్థవాది
కోహెడ మండలం లోని కూరెళ్ళ, తంగళ్ళపల్లి, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గ్రామాల మధ్యలో గల శ్రీ ప్రతాప రుద్ర సింగరాయ జాతర ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర జరిగిందని కోహెడ తహసిల్దార్ జావిద్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.కూరెల్ల మరియు తంగళ్ళపల్లి గ్రామాల సరిహద్దుల్లో సింగరాయ జాతర జరుగుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా సరిహద్దుల వివాదం తలెత్తినందున ఈ సంవత్సరం రెవెన్యూశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో జాతరను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగియడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు…