బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
యదార్థవాది ప్రతినిధి జగిత్యాల
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన బండారి పెద్ద కనుకయ్యకి చెందిన పూరి గుడిసె శనివారం నాడు అగ్ని ప్రమాదానికి గుడిసె కూలిపోయి, కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులు, బంగారం, ధాన్యం బస్తాలు, బట్టలు, సర్టిఫికెట్ లు పూర్తి అగ్నికి ఆహుతై, కట్టుకోడానికి బట్టలు లేని పరిస్థితి ఉన్నావారిని మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు, మంత్రి మండలం బిఆరెస్ పార్టీ నాయకులు కలిసి 2 లక్షల 55 వేలు రూపాయల విరాళాలతో పాటు రెండు నెలకు సంబంధించిన నిత్యావసర వస్తువులను కనకయ్య కుటుంబానికి అందించడం జరిగింది, అనంతరం ఎల్లాపూర్ కుటుంబాన్ని ఓదార్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు, అనంతరం స్నేహలత గారు కనుకయ్య కుటుంబ సభ్యులకు బట్టలను అందించారు ఈ సందర్భంగా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన సిద్దార్థ అనే బాబు తాను సొంతంగా దాచుకున్న డబ్బులు 1050 రూపాయల కనుకయ్య కుటుంబానికి అందించారు.