బిక్షటన చేసిన కార్మికులు
కోహెడ మేజర్ న్యూస్:
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
కోహెడ మండల కేంద్రంలోని దుకాణ సముదాయాల వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం భిక్షాటన చేశారు.. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ పంచాయతీ కార్మికులకు జీఓ నెం.60 ప్రకారం వేతనాల పెంపు మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేసి, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, గ్రామాల్లోని ప్రజలకు అనారోగ్యానికి గురికాకుండా ఎల్లవేళలా పారిశుద్ధ్యం ను ప్రలాదోవి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా కష్టపడి పనిచేసే గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ పంచాయతీ కార్మికులుగా గుర్తించాలి జీఓ నెం 51 ని సవరించాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి పి.ఆర్.సి.లో నిర్ణయించిన మినిమమ్ బేసికిను 19000/-వేల వేతనాన్ని పెంచాలి. జీఓ నెం 60 ప్రకారం స్వీపర్లకు,పంపు ఆపరేటర్ల,ఎలక్ట్రిషియన్లకు,డ్రైవర్లకు,వేతనాలు పెంచాలి కారోబర్ లకు,బిల్ కలెక్టర్ లకు, సహాయ కార్యదర్శులుగా నియమించాలి.పి.ఎఫ్.ఈ.ఎస్.ఐ ప్రమాధభీమా గ్రాట్యుటి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మెట్టు వెంకటరెడ్డి, తలారి అనిల్,ఆకుబత్తిని రాజమౌళి,పోచయ్య,మూటం సంపత్ 27 గ్రామాల పంచాయతీ కార్మికులు,మండల సంఘం కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు..