బిజెపి కార్పొరేటర్ మృతి..
హైదరాబాద్: 13 యదార్థవాది ప్రతినిది
దేవర కరుణాకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన..మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జి హెచ్ ఎం సి కమిషనర్.. గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 71 వార్డు గుడి మల్లాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణం పట్ల మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి దేవర కరుణాకర్ మరణ సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సిటీ న్యూరో హాస్పిటల్ కు వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కరుణాకర్ గుడి మల్కా పూర్ కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు పనిచేశారని ఏంతో సామ్యుడు గా పేరు గాంచినట్లు ఆయన మృతి బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. సీనియర్ కార్పొరేటర్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని,
కార్పొరేటర్ గా, నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వారనీ.. అన్ని పార్టీల కార్పొరేటర్ల తో మంచిగా, సఖ్యతగా సౌమ్యుడు గా ఉండే వారని కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. అయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కమిషనర్ ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మేయర్, కమిషనర్ సానుభూతిని వ్యక్తం చేశారు.