భక్తులతో మమేకమైన ఎమ్మెల్యే
-జాతర ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసినా కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. అనంతరం జాతరకు వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ..భక్తులతో ముచ్చటించారు.. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఅర్ ప్రభుత్వంలో పది సంవ్సరాలపాటు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన కూడవెల్లి రామలింగేశ్వర జాతరను ఘనంగా నిరహించామని ప్రజా పాలనలో జాతర ఏర్పాట్లు చేయడంతో విఫలమైందని అన్నారు. జాతరకు లక్షలాది ప్రజలు వస్తారని వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లో ప్రభుత్వం విఫలం అయ్యింది పోలీస్ శాఖ పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేయలేదని, చిన్న పిల్లలు తప్పిపోయిన, తొక్కిసలాట జరిగిన, ఏదైనా ప్రమాదం జరిగిన ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. సిద్దిపేట పోలిస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ జాతరలో ఉండి ఏర్పాట్లు పరిశీలించాలి గాని, సిద్దిపేట లో ఉంటే ఇక్కడ సమస్యలు ఎలా పరిష్కరిస్తారని, ఎంతో ఘనమైన చరత్ర కలిగినా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతరలో భక్తుల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి తో వ్యవహారించలేదని అన్నారు. ఎమ్మేల్యే తోపాటు జిల్లా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
