భారీ వర్షంతో అప్రమత్తం అయిన పోలీస్ యంత్రంగం.
సిరిసిల్ల యదార్థవాది
సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలోకి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ఈ సంద్భంగా అయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టి జలమయమయ్యే ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రానికి తరలిస్తున్నమని, నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ప్రమాదస్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.. ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు, ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, 12 మందితో కూడిన జిల్లా DRF టీమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, పిల్లలు, యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, విపత్కర సమయాల్లో డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతమని తెలిపారు…