37.1 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.

మంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.

మంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.

యదార్థవాది కొండపాక

ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి పెంచిన వేతనాలు ,పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రామిక, మహిళ జిల్లా కార్యదర్శి దాసరి కళావతి డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి కార్మికుల సమస్యలతో డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దాసరి కళావతి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జులై15న పత్రికసమవేశంలో చెప్పిన మాట నేటికీ అమలు కాకపోవడం శోచనీయమని అన్నారు.
పెండింగ్ బిల్లులు మూడు నాలుగు నెలల నుండి ఇవ్వకపోవడంతో, కార్మికులు లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఇబ్బందులకు గురవుతున్న్నానారని కార్మికులకు రూ. 3000 ఇస్తానని ప్రకటించి నేటికి 5 నెలలు కావస్తున్న అమలు జరపకపోవడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కొత్త మెనూ పెట్టాలని చెప్పడం తప్ప దానికి బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 18,000 వేలు ఇవ్వాలని, కార్మికులందరికీ ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కార్మికులందరికీ రెండు జాతల దుస్తులు వంట పాత్రలు ఇవ్వాలని తెలిపారు.ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి పరిష్కరించాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొండపాక మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ బాల లక్ష్మి నాయకులు బైరెడ్డి నీలారెడ్డి, భాషయ్య పోశవ్వ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్