34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమంత్రి హరీష్ రావుకు అందత్వం ఎప్పుడు వచ్చింది.?

మంత్రి హరీష్ రావుకు అందత్వం ఎప్పుడు వచ్చింది.?

మంత్రి హరీష్ రావుకు అందత్వం ఎప్పుడు వచ్చింది.?

తన్నీరు హరీష్ రావు పుట్టక ముందే త్యాగాల భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ)నేతలు
ఉన్నారన్నది మర్చిపోయారు.

సిపిఐకి మంత్రి తన్నీరు హరీష్ రావు వెంటనే క్షేమపణ చెప్పాలి.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం సిద్దిపేటలో జరిగిన ఆశా, అంగన్ వాడి కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటుంటే మంత్రికి ఇంత అంధత్వం ఎప్పుడు వచ్చింది..అనే అనుమానం కలుగుతుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు.. బుధవారం అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ మంత్రి తన్నీరు హరీష్ రావు వయసు చాలా చిన్నదని, ఆయన పుట్టక ముందు నుండే భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) 100 సంవత్సరలుగా అనేక త్యాగాలు చేసిన త్యాగదనులు నేటికి లక్షలాది మంది నాయకులు కార్యకర్తలు ఉన్నా మంత్రికి కనబడడంలేదా..అంటు గడిపె మల్లేశ్ గాటుగా విమర్శించారు.. అసలు అంగన్ వాడి, ఆశా వర్కర్లను మభ్యపెట్టి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి వారిని వామపక్ష పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలొ సభ్యం తీసుకునేల మీ వైపుకు తిప్పుకున్నారన్నది మంత్రి మర్చిపోవద్దని గడిపె మల్లేశ్ అన్నారు. అధికార దాహంతో అడ్డుదారులు తొక్కి పైకొచ్చిన మీరు వాస్తవాలు చూడలేని‌ కళ్లు లేని కబోదులుగా మారితే ప్రజల్ని మిమ్మలిని ఏ విధంగా అర్థం చేసుకుంటారనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడటం సరైంది కాదని ఇటివల మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టు కార్యకర్తలే లేకపోతే మీ బిఆర్ఎస్ పార్టీ బతుకు మీ బతుకు ఎక్కడ ఉండేదో ఒకసారి ఆలోచించుకోవాలని, ఆనాడు కమ్యూనిస్టులు వీర యోధులు లేకుంటే లక్షలాది మంది కార్మిక నాయకులు, పిడిత ప్రజలు శ్రమజీవులు ప్రపంచలో పేదరికం నిర్మూలన కోసం సూర్య చంద్రులు ఉన్నంత వరకు కార్మికులు కర్షకులు పేదలు కమ్యూనిస్టుల వెంటే ఉంటారని ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు జ్ఞానోదయం చేసుకొవలని మంత్రి హరీష్ రావుకు సూచించారు.. మీ పార్టీకి మీకు అధికార దాహం కమ్యూనిస్టులకు శ్రామిక జన రాజ్యాధికారం కోసం త్యాగాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని రాజకీయలను వ్యాపారంగా మార్చి డబ్బిచ్చి ఓట్లు కొనే నీచ సంస్కృతిని ప్రవేశపెట్టిందని, మీ వంటి పెట్టుబడిదారు పార్టీలే ఇంత మాట్లాడిన మీకు నీతి నిజాయితీ గనుక ఉంటే మీకు దమ్ముంటే దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలని, కమ్యూనిస్టులు దేశంలోని అన్ని చట్ట సభల్లో స్థానాలు గెలవకపోతే అప్పుడు మాట్లాడండి.. ఎన్నికల్లో డబ్బిచ్చి ఓట్లను కొనకపోతే కమ్యూనిస్టుల గెలుపుని ఎవ్వరూ ఆపలేరన్నది నగ్న సత్యమని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న మంత్రి ఇప్పటికైనా తెలుసుకోవాలని, తెలంగాణ సాయుధపోరాటం ఫలితం ఆనాటి త్యాగాల పునాదుల మీదనే నేడు ఆధికారంలో ఉన్నారని కమ్యూనిస్టులను కించపరచకుండా కమ్యూనిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలని సిపిఐ త్యాగాలను గౌరవిస్తే మంత్రి తన్నీరు హరీష్ రావుకు మంచిదని గడిపె మల్లేశ్ అన్నారు.. విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ కార్యదర్శి పిల్లి రజినీ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి సభ్యులు నేలవేణి స్వప్న,సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, మౌటం బాలయ్య, పోదిల కనకస్వామి, శివరాత్రి మల్లయ్య, పుదరి రఘుపతి, ఇంద్రాల మల్లయ్య, గట్టు మల్లేశం, మహిళా సమాఖ్య నాయకురాల్లు పెద్ది నిర్మల, పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్