34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమట్టి పాత్రలకు కేరాఫ్ సిద్దిపేట

మట్టి పాత్రలకు కేరాఫ్ సిద్దిపేట

మట్టి పాత్రలకు కేరాఫ్ సిద్దిపేట

-సిద్ధిపేటలో కుమ్మర్ల ఫైలెట్ ప్రాజెక్ట్ కి 2.20 కోట్ల నిధులు మంజూరు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

రాష్ట్రం లోనే మొట్ట మొదటగా మట్టి పాత్రలను యూనిట్ సిద్దిపేట జిల్లా లోనే మట్టి పాత్రల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలానే ఉద్దేశంతో కుమ్మర్ల ఫైలెట్ ప్రాజెక్ట్ కి 2.20 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుమ్మర్ల అభివృద్ధి కోసం, మరుగున పడుతున్న కుమ్మర వృత్తి ని బతికించడానికి, ప్లాస్టిక్ మహమ్మారిని అంతమొందించడానికి ప్రజల అనారోగ్యం నుండి బయట పడటానికి అన్నింటికీ ప్రత్యామ్నాయం మట్టి పాత్రలను వాడకాన్ని పెంచడానికి రాష్ట్రం లోనే మొట్ట మొదటగా సిద్దిపేటలోనే మట్టి పాత్రల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలానే ఉద్దేశంతో ఈ ఫైలెట్ ప్రాజెక్ట్ లో అన్ని రకాల (చాయి గ్లాస్ లు, వాటర్ గ్లాస్ లు, ప్లేట్స్, బౌగొన్లు, ఇట్లో వాడుకునే అన్ని పాత్రలు, ఇంట్లో అలంకరణకు పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు వంటివి అన్నీ) మట్టి ని ఉపయోగించి ఆదునికరమైన మిషన్లతో తయారు చేస్తారు.. ఈ ఫ్యాక్టరీ వల్ల సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన అన్ని కుమ్మర కుటుంబాలకి లాభం జరుగుతుందని కుమ్మర్ల కు ఉచిత శిక్షణ ని కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కుమ్మర్లకు గతంలో రెండు ఎకరాల స్థలాన్ని కెసిఆర్ నగర్ లో కేటాయించడం జరిగిందని, కుమ్మర్ల పైలెట్ ప్రాజెక్టును నిర్మించడానికి మంత్రివర్యులు కుమ్మర్ల పైలట్ ప్రాజెక్టు కోసం రెండు కోట్ల 20 లక్షల రూపాయలను నిధుల జీవో కాపీని కుమ్మర జిల్లా అధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్, ఫైలెట్ ప్రాజెక్టు ఇన్చార్జి నెల్లుట్ల విజయ్ లకు మంత్రి అందించారు.. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వర్కోల్ శ్రీనివాస్, జిల్లా నాయకులు గోవిందారం శ్రీనివాస్, ఫైలెట్ ప్రాజెక్ట్ కో ఇంఛార్జి మూడపల్లి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నార్లపురం తిరుపతి, కట్కూరి రవీందర్,,జిల్లా యువజన అధ్యక్షులు తరిగొప్పుల రామచంద్రం,వక్కింగ్ అధ్యక్షులు శనిగరం ఆంజనేయులు,జిల్లా కోశాదికారి కొలిపాక సంపత్,జిల్లా ముఖ్యనాయకులు,,కృష్ణ మూర్తి, జిల్లా యవజన గౌరవ అధ్యక్షులు శాతరాశి రాజు, శ్రీశైలం,రామ్మోహన్, బాలు,రాజు,రాఘు, నగేష్ ,కిషన్,శ్రీను,భగవాన్,రాములు,కిష్టయ్య మధు, నాంపల్లి కిషన్ ,గోవిందారం శ్రీను,దుంపలపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్