– ఎల్లమ్మ చెరువులో మూడు లక్షల చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మూడు లక్షల చేప పిల్లలను వదిలిన రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 49,87, 876 చేప పిల్లలను వదులుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈరొజు సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులు నేడు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు చెరువులకు ప్రభుత్వం హక్కు కల్పించి చేప పిల్లలను రాష్ట ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తద్వారా పెరిగిన చేపలను మత్స్యకారులు పట్టుకుని వాటిని అమ్ముకొని వారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని తద్వారా గణనీయమైన తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు. గురువారం పోతారం (ఎస్ )శుభం గార్డెన్ లో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన మత్స్యకారులకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి గుర్తింపు కార్డులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ లు అందించారు. రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ పురుషుల మత్స్యకారుల సొసైటీ ఉన్నట్లుగానే మహిళలకు కూడా మత్స్యకారుల సొసైటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, మత్స్యకారులకు టూవీలర్లు, ఆటోలు గతంలో అందించినట్లుగా త్వరలో అందిస్తామని మత్స్యకారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మనసున్న మహారాజు సిడి ఆవిష్కరణ కోతి దీక్షిత, ఆశ్విక్ సమర్పించు, ముక్కెర సంపత్ కుమార్ రచించిన గీతాలు సిడి మనసున్న మహారాజు మన హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ సతీష్ కుమార్ సిడీలను రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు ఇందులో ఆడియో, వీడియో పాటలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి అక్కన్నపేట ఎంపీపీ మంగ రజిత పెద్ద ఎత్తున మత్స్యకారులు మహిళలు, పురుషులు పాల్గొన్నారు.