30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన..జిల్లా కలెక్టర్

మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన..జిల్లా కలెక్టర్

మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన..జిల్లా కలెక్టర్

సిద్దిపేట యదార్థవాది

జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయించిన పాఠశాలలో పనుల పురోగతిపై గురువారం ఎంఈవో ఎంపిడిఒ ఎంపిఓ ఇంజినీరింగ్ విభాగం ఈఈ డిఈ ఎఈ నిర్మాణ ఏజెన్సీలు సర్పంచ్ లతో కలిసి పాఠశాలల వారిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.. సమావేశం లో ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి పథక పనులు నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అకాడమిక్ సంవత్సరం ముగిసే లోపు తప్పనిసరి గా పనుల్లో వేగం పెంచి పూర్తి చేయ్యాలని మన ఊరు మన బడి పథకం లో ఎలక్ట్రిసిటీ పనుల్లో నాణ్యమైనవి (రూపింగ్ లైట్లు ప్యాన్లు), తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లు,తో పాటు ఈజీఎస్ పనులు టాయిలెట్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, డైనింగ్ హల్, అదనపు తరగతి గదులు ఇతర పనులు భవనం అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదు పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే మైదానంలో సుందరీకరణ చేయ్యాలని తెలిపారు. ఈజిఎస్ పనుల జనరేట్ చేసిన ఎస్టిమేట్ వివరాలను అందించాలని డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డికి ఆదేశించారు. ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలి కలరింగ్ ఏజెన్సీ కి మెథర్ మెంట్ షిట్ అందించాలని ఎంపిడిఒ ఎంపిఓ లు ఏఈ లకు తోడ్పాటునందించాలని హబ్సిపూర్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చెయ్యాలని ఎఈ, డిఈ కి ఆదేశించారు. పనులు పూర్తి అయ్యేవరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం కావున మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. సమావేశం లో అసిస్టెంట్ కలెక్టర్ పైజాన్ ఆహ్మద్, డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్