మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టు దిట్టమైన భద్రత..
సిద్ధిపేట: యదార్థవాది ప్రతినిది
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొదటి ఆదివారం సందర్భంగా వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడం జరిగిందాని, టెంపుల్ ఆవరణలో 80 సీసీ కెమెరాలతో పటిష్టమైన చేస్తున్నామని తెలిపారు. టెంపుల్ ఆవరణ చుట్టుపక్కల దర్శన ప్రదేశాలు ఒక సెక్టరుగా, పార్కింగ్ ప్రదేశాలు రెండవ సెక్టార్గా విభజించమని, విఐపి దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం మూడు విభా మూడు విభాగాలుగా విభజించడం జరిగిందాని, భక్తులకు అన్నివేళలా అందుబాటులో ఇద్దరు ఏసీపీలు, 14 మంది సీఐలు, 17 మంది ఎస్సైలతో పాటు 273 పోలీస్ అధికారులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, చేర్యాల సిఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సీఐలు ఎస్సైలు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఎన్సిసి స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు..