34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమల్లన్న సాగర్ సందర్శించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.

మల్లన్న సాగర్ సందర్శించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.

మల్లన్న సాగర్ సందర్శించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ను సందర్శించిన ఫ్యాకల్టీ ఇంచార్జ్ ప్రియాంక్ భర్త్ నేతృత్వంలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు. ఈ సందర్భంగా గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మల్లన్న సాగర్ ఇఇ వెంకటేశ్వర్లు, మల్లన్న సాగర్ పంపు హౌస్ డిఇ శ్రీనివాస్ లు శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ గురించి వివరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంమని రాష్ట్రంలోని పాత ఆయకట్టును స్థిరీకరించడం తోపాటు నూతనంగా లక్షలాది ఎకరాల ఆయకట్టిన సాగులోనికి తీసుకురావడం లక్ష్యంగా 2016 రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించారని ఇప్పటికీ దాదాపు పూర్తయిందని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి ఆసక్తిగా విన్న ఎన్డీఏ అధికారులు మల్లన్న సాగర్ ను చూసి పంప్ హౌస్ అండర్ టర్నల్ లోకి బస్సు మరియు ఇతర వాహనాల ద్వారా ప్రయాణించి ఇంజనీరింగ్ టెక్నాలజీని చూసి ఇంత పెద్ద ప్రాజెక్టును చూడడం ఇదే మొదటిసారి అని ఈ ప్రాజెక్టును నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్