మహిళకు చదువు ఎంతో అవసరం
సిద్దిపేట: 13 యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట సబ్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ స్వాతి రెడ్డి సిద్దిపేట పట్టణంలోని భరోసా సెంటర్ సందర్శించారు.. భరోసా సెంటర్, సఖి సెంటర్, స్నేహిత మహిళ సహాయక కేంద్రం సిబ్బందితో మాట్లాడుతూ మహిళలు, పిల్లల రక్షణ, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాల చేపట్టి, లైంగిక వేధింపు కేసులను తగ్గించవచ్చని తెలిపారు. తెలిసి తెలియని వయస్సులో తప్పులు చేస్తుంటారని, ఎలాంటి పొరపాట్లు చేయవద్దని, పిల్లలు మహిళా మనుగడకు చదువు చాలా ముఖ్యమని, చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, భరోసా, సఖి, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్, నిర్వాహకులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/30-1-1024x591.jpg)