మహిళల భద్రత కోసమే షీ టీం లు
గోదావరిఖని యదార్థవాది
మహిళల భద్రత పట్ల మంగళవారం గోదావరిఖని ఆర్జీ వన్ ఏరియా వర్క్ షాప్ లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత కొరకే షీ టీం లను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, మహిళలను ఎవరైనా వేధించిన, అసభ్యకరమైన మెసేజ్ లు పంపిన, షీ టీంకు వాట్సాప్ 6303023700 మెసేజ్ చేస్తే తక్షణమే వారిపై చర్య తీసుకుంటామని షీ టీం ఇంచార్జ్ ఏఎస్ఐ మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు స్నేహాలత, సురేష్ డీజీఎం మదన్మోహన్, జూనియర్ ఇన్స్పెక్టర్ ఉమేష్, మహిళా కార్మికులు పాల్గోన్నారు.