34.2 C
Hyderabad
Sunday, June 1, 2025
హోమ్తెలంగాణమహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్

మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్

మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్

యదార్థవాది ప్రతినిధి సిద్ధిపేట

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమాన్ని సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, జిల్లా మేజిస్ట్రేట్ రఘురామ్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి 5కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5కే రన్ కోసం వచ్చిన వారందరిలో ఉత్సాహం చూస్తే చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ ద్వారా మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని మహిళల అభ్యున్నతి కోసం మనమందరం కలిసి కట్టుగా కృషి చూద్దామని మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలో జరిగిన 5కే రన్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందుకున్న వారు స్త్రీల విభాగంలో బీ.ఇందు-తృతీయ-5వేలు, బీ.హారిక-ద్వితీయ-7500, కావ్య ప్రథమ రూ.10వేలు బహుమతి పొందారు. పురుషుల విభాగంలో సి.హెచ్.ఎల్లం తృతీయ-5వేలు, జి.అభిషేక్-ద్వితీయ-7500, కే.అఖిల్ ప్రథమ రూ.10వేలు బహుమతి మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్