మాకు రాజ్యాధికారం కావాలి.
-సంచార జాతులకు రాజ్యాంగంలో రిజర్వేషన్ కావాలి
-పాలక పక్షం, ప్రతిపక్షం మా జాతి బిడ్డ గంగాధర్ కు అవకాశం ఇయ్యాలి
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘము అధ్వర్యంలో సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు ఆగుళ్ల శంకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తిపిరిశెట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్ పాల్గోన్నారు.ఈ సందర్బంగా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తిపిరిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా పోయిందని, రాజ్యాంగంలో సంచార జాతులకు రిజర్వేషన్స్ లేక మా జాతులకు అన్యాయం జరుగుతుందని, అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలక పక్షం, ప్రతిపక్షం మాకు రాజ్యాధికారం లో భాగంగా మా కులానికి ఎమ్మెల్సీ పదవి కానీ, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఆయన అన్నారు. నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సంచర జాతి బిడ్డ మధనం గంగాధర్ ను ఈసారి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని, సంచార సామజిక వర్గాల నుండి విద్యా వేత్త మధనం గంగాధర్ తన ఉద్యోగ జీవితం త్యాగం చేసి ప్రజా సేవ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి అధికార పార్టీ సపోర్ట్ చేయాలనీ సంచార జాతుల సంఘం ప్రభుత్వాన్ని కోరారు.. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాలు బిసిల్లో 52, ఎస్సి ల్లో 10, ఎస్టీ ల్లో 4 కులాలు ఉన్నాయన్నారు. ఇవి జనాభా ప్రకారం బిసిల్లో 12శాతం, ఎస్సీ లలో 20శాతం, ఎస్టీ ల్లో 10శాతం ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రములో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సందర్బంగా మా సంచార జాతి బిడ్డలను మొదటి ప్రాధాన్యత ఓటుతో మధనం గంగాధర్ ను గెలిపించుకుందామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆగుళ్ల శంకర్, బోయ రాములు, అరె రాములు దొమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆంజనేయులు మొండిబండ, తాళ్ల స్వామి కార్యదర్శి, దొమ్మర, గోత్రాల, వీర బద్రియ, మొండిబండ, మందుల, గంగిరెద్దుల కులాల నాయకులు పాల్గొన్నారు.