మాధపూర్ వాసులను కలిషిత నీటినుండి కాపాడుదాం..
యాదాద్రి: 8 జనవరి యదార్థవాది ప్రతినిది
మంచినీరు అందిచడానికి వాటర్ ప్లాంట్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాధపూర్ ప్రభుత్వ పాటశాలలో బీర్ల ఫౌండేషన్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గ్రామాల్లో మంచి నీటిని అందిచాలనే ఉదేశ్యం తో వాటర్ ప్లాంట్ ప్రారంభించమన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పాటశాలల్లో కలుషిత భోజనం కలుషిత వాటర్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, మిషన్ భగీరథ వాటర్ గ్రామ పంచాయతీ వాటర్ రెండు కలసి గ్రామాల్లో వాటర్ అందిచటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. మాధపూర్ గ్రామంలో రెండు వాటర్ ప్లాంట్ ప్రారంభిచడం జరిగిందని తెలిపారు.