మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికై కృషి.. మంత్రి హరీష్ రావు హామీ…
సిద్దిపేట జిల్లా మీసేవ ఆపరేటర్ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కి మద్దతుగా హైదరాబాద్ లో గురువారం మంత్రి హరీష్ రావు నివాసంలో విరాళం అందించారు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నమీసేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వివరించారు. కులాలు, ఆదాయం, మరియు మీ సేవ సంబంధించిన సర్వీసులు మీసేవ దరఖాస్తు చేసి సంబంధిత డాక్యుమెంటులు ఆఫీసులకు స్కాన్ చేసి పంపడం జరుగుతుందని, అధికారులు మళ్లీ ఫిజికల్ కాపీలు కావాలి అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మంత్రి హరీష్ రావు దృష్టికితీసుకెళ్లారు. దీనికి మంత్రి స్థానుకులంగా స్పందించి, సమస్యలు పరిష్కారానికై కృషి చేస్తానని మంత్రి ఇచ్చారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా విరాళం మీసేవ ఆపరేటర్లు మంత్రి హరీష్ రావుకు ఇచ్చారు. కార్యక్రమంలో TMSA అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు యూసఫ్, ఆడెపు మహేష్ తోట శ్రీకాంత్,వెంకట్, నవీన్ బాబు ఆంజనేయులు మంతపురి చంద్రం అశోక్ తదితరులు పాల్గొన్నారు.