మీ ఇంట్లో ఒకడిగా ఉంటా.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా..
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ యదార్థవాది ప్రతినిధి
సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం సనుగుల దేవుని తండా గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇటీవల మరణించిన దేవుని తండా సర్పంచ్ భూక్య పంతులు నాయక్ గంగాధర రామస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గా ఎన్నికై తొలిసారి సనుగుల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన చందుర్తి మండల ప్రజలతో పాటు సనుగుల దేవుని తండా గ్రామాల ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటానని మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్ గా మరో మెట్టేక్కించారని ఎన్నికల ప్రచారంలో మీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మీ ఇంట్లో ఒకడిగా ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలులో భాగంగా మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని రాజీవ్ ఆరోగ్య శ్రీపథకం కింద పది లక్షల వరకు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.