మున్సిపల్ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
కామారెడ్డి మున్సిపాలిటీలో పని చేయుచున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం కామారెడ్డి మున్సిపల్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దేవేందర్ కు వినతిపత్రం సమర్పించారు వెంటనే స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో పెండింగ్ జీతాలు ఇస్తామని అలాగే మార్చిలోపు ఏరియర్స్ పి ఎస్ .ఈఎస్ఐ చెల్లిస్తామని హామీ ఇచ్చారు సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మద్దతు తెలిపీ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పాలకవర్గం పనిచేయాలని మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ కార్మికులకు బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దీపక్ జిల్లా కోశాధికారి నాయకులు మధు వీరయ్య దీవెన శివరాజవ బి రాజవ్వ ఎర్రోళ్ల నరసవ్వ గంగవ్వ రంజిత్ భరత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.