26.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
హోమ్తెలంగాణముస్తాబయిన శివాలయం

ముస్తాబయిన శివాలయం

ముస్తాబయిన శివాలయం

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

ఆర్మూర్ పట్టణం ప్రఖ్యాతిగాంచిన నవనాద సిద్ధుల గుట్టపై శివాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా శివపార్వతుల కళ్యాణం, శనివారం శివరాత్రి దర్శనం, ఆదివారం లక్ష మందికి అన్నదాన కార్యకమఏర్పాట్లను చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏనుగు శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం రోజు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మూడు క్యూలైన్లను ఏర్పాట్లు చేశామని, నవనాథ సిద్దుల గుట్టను అభివృద్ధి చేయడం జరిగిందని, సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఇదివరకే పూర్తి అయిందని, సిద్ధుల గుట్ట పైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సహకారంతో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నక్కల లక్ష్మణ్, కొడిగేల మల్లయ్య, కిషన్, బిఅరేస్ నాయకులు పవన్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్