30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్మూడేళ్లలో జగన్‌ సర్కార్‌ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన

మూడేళ్లలో జగన్‌ సర్కార్‌ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన

యదార్థవాది ప్రతినిధి అమరావతి

ఏపీ ఆర్థిక అంశాలపై తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటనపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై యనమల నిరాధార ఆరోపణలు, అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంపై తెదేపా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి బుగ్గన ఆరోపిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేశారు. స్థిరధరల వృద్ధి రేటులో 2021-22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఏవిధంగా లెక్కవేసినా మైనస్‌ 4శాతం వృద్ధి అనేది అసాధ్యమని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో దేశ వృద్ధిరేటు -6.60 శాతంగా నమోదైతే ఏపీ 0.08శాతం మేర వృద్ధి నమోదు చేసిందన్నారు. అనుభవజ్ఞుడైన యనమల జీఎస్డీపీని గణించటంలో తప్పుచేశారని మంత్రి బుగ్గన ఆక్షేపించారు. నవరత్నాల ద్వారా ఇప్పటికి రూ.1.92 లక్షల కోట్లు అందించినట్టు వెల్లడించారు. ప్రతి ఊరిలో ఏర్పాటైన సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజి క్లీనిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాలను అభివృద్ధిగా పరిగణించరా? అని మంత్రి పశ్నించారు. ఖజానా ఖాళీ.. రూ.100 కోట్లు మాత్రమే మిగిలిందంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక, జింబాబ్వేలా తయారైందని వ్యాఖ్యలు చేయటం బాధ్యతా రాహిత్యమన్నారు. 40ఏళ్లు పైబడిన యువనాయకుడు సీఎంగా ఎలా అభివృద్ధి చేస్తున్నాడో అర్థంకాక తెదేపా నేతలు తలలు పట్టుకుంటున్నారని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. 2019లో తెదేపా దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల అప్పు ఉంటే.. 2022 నాటికి రూ.3,98,903 కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,34,452 కోట్లు మాత్రమేనని బుగ్గన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్