29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమూన్నాళ్ళ ముచ్చటనా.. ఈ ఆధార్ సెంటర్.!

మూన్నాళ్ళ ముచ్చటనా.. ఈ ఆధార్ సెంటర్.!

మూన్నాళ్ళ ముచ్చటనా.. ఈ ఆధార్ సెంటర్.!

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిధి

కోహెడ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ పనిచేయకపోవడం సిగ్గుచేటని బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం వ్యాఖ్యానించారు  సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం వెంకటేశం మాట్లాడుతూ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ పని చేయకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పలుమార్లు అధికారులకు తెలిపిన ఫలితం లేకపోయిందని కొత్త ఆధార్ కార్డు చిన్నపిల్లల ఆధార్ కార్డు అలాగే ఆధార్ అనుసంధానంకు కోహెడ లో ఆధార్ సెంటర్ ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యధోరనితో పనిచేయక స్థానికంగా 100 రూపాయల లోపు అయిపోయే ఆధార్ కార్డు చంటి పిల్లలతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చిస్తున్న పరిస్థితి నెలకొందని గత కొన్ని నెల క్రితం కోహెడ లోని పర్మినెంట్ ఆధార్ సెంటర్ ఎక్కడ అని అధికారులను ప్రశ్నించగా జిల్లా మీసేవ అధికారులు హుటాహుటిన వచ్చి నామమాత్రంగా ప్రారంభించారు అది మూడు రోజులు కూడా నడవకపోవడం సిగ్గుచేటని  అధికారుల నిర్లక్ష్యం అలసత్వం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారని జిల్లా అధికారులకు మా మండలంపై ఎందుకంత వివక్ష చూపుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు. ఇప్పటికైనా కోహెడలో ఆధార్ సెంటర్ రెగ్యులర్ గా నడిచేవిధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కోహెడ ఖమ్మం వెంకటేశం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బండ జగన్ యాదవ్, గుగ్గిళ్ల శ్రీనివాస్ బిజెపి మండల ప్రధానకార్యదర్శులు పిల్లి నర్సయ్య గౌడ్ జాలిగం రమేష్ బిజెవైఎం మండల అధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, తదితరులున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్