మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి…
దుబ్బాక యదార్థవాది ప్రతినిది
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనత అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 18, 19, 03 వ వార్డులలో ఇంటింటికి రెండు పూల మొక్కలను పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలే ప్రాణానికి జీవనాధారమని మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, స్వప్న రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మున్సిపల్ అధికారి నగేష్ వార్డు సభ్యులు బిఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.