23.5 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణమొదలైన రెండో విడత కంటి పరీక్షలు..

మొదలైన రెండో విడత కంటి పరీక్షలు..

మొదలైన రెండో విడత కంటి పరీక్షలు..

సిద్దిపేట: యదార్థవాది ప్రతినిది

మర్కుక్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.. కంటి పరీక్షల తీరును పరిశీలించి కంటి పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది సూచనలు చేస్తూ ఫర్ఫెక్ట్ గా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రీడింగ్ గ్లాస్ లను వెంటనే అందించాలని, ప్రెస్క్రిప్షన్ గ్లాసెస్ ను వారం రోజులలోగా తెప్పించి ఆశా కార్యకర్తల ద్వారా ఇంటి వద్దనే అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను తెలిపారు. ప్రతి కంటివెలుగు నిర్వహణ క్యాంపులో నిబంధనల మేరకు నాణ్యత ఏర్పాట్లను పరిశీలించాలని ల్వాలిటి కంట్రోల్ అబ్సర్వర్ డా. రాకేష్ ను ఆదేశించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని జిల్లాలో 45 వైద్య బృందాలు పనిచేస్తాయని వాటిలో 35 గ్రామీణ, 10 బృందాలు పట్టణ ప్రాంతాలలో షెడ్యూల్ ప్రకారం కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలను అందిస్తామని తెలిపారు. 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేపించుకోవాలని తెలిపారు. రోజుకు ఒక క్యాంపు లో 100 నుండి 150 మందికి కంటి పరీక్ష చేస్తామని ఒక గ్రామంలో మూడు నుంచి నాలుగు రోజుల వరకు క్యాంపు నిర్వహించి చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు నిర్వహించుకునేలా ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు… రాష్ట్ర అట అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు గొప్ప కార్యక్రమని, పట్టణాలకు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకునే స్థోమత లేని గ్రామీణ ప్రజలకు, పట్టణ ప్రాంతాలలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎంత ఉపయోగకరమైనదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని, నిన్న ఖమ్మంలో పంజాబ్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసించి ఈ కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. కాశీనాథ్, కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు డాక్టర్. శ్రీదేవి, వైద్యాధికారులు శ్రీనివాస్, శశిశ్రీ, ఆశాజ్యోతి, స్థానిక ఎంపీపీ జడ్పిటిసి సర్పంచ్ ఎంపీటీసీ తాసిల్దార్ ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్