రాజన్న భక్తులకు అందుబాటులో అంబులెన్స్
దక్షిణ కాశీగా ప్రతిధ్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి వేలాది భక్తులు నిత్యం దర్శించుకోవడానికి వస్తుంటారు..ఇటీవల క్యూ లైన్ లో భక్తులకు జరిగిన కొన్ని అసౌకర్యాలను తెలుసుకున్న శ్రీ మతి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయ భక్తుల సౌకర్యార్థం అత్యవసర సమయాల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు సోమవారం ట్రస్ట్ సభ్యులు దేవాలయంలో అంబులెన్స్ ను అందుబాటులో ఉంచామని మీడియా తో తెలిపారు. అత్యవసర సమయాల్లో భక్తులు అంబులెన్స్ ను ఉపయోగించుకోవాలనీ అన్నారు..