22.6 C
Hyderabad
Wednesday, September 17, 2025
హోమ్తెలంగాణరానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా ఎగురుతుంది..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా ఎగురుతుంది..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా ఎగురుతుంది..

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డ మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా రేప రేప లాడుతుందని. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. మంగళవారం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్లో అధ్యక్షులు పార్టీ బలోపేతం చేయాలని, తమ డివిజన్లలో ఉన్న సమస్యలపై పోరాటం చేద్దాం అని, ఇప్పటికే నగరంలోని 60 డివిజన్లలో కమిటీలు పూర్తి చేశామని, నేటి నుండి నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకెళ్తామన్నారు. నగరంలో ఉన్న ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ, బీసీ, విభాగం జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్. యువజన అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్