రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష సమావేశం..
దుబ్బాక యదార్థవాది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై పురపాలిక కార్యాలయంలో బుధవారం కౌన్సిలర్లు పురపాలిక అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన చైర్పర్సన్ గన్నె వనితా భూమి రెడ్డి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు దాదాపు 20 రోజులపాటు జరగనున్నాయని, జూన్ రెండు నుంచి జూన్ 22 వరకు జరిగే ఈ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పురపాలిక కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, ఆశ యాదగిరి దుబ్బాక బాలకృష్ణ మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.