రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ
న్యుడిల్లి: యదార్థవాది ప్రతినిది
జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టేందుకే జీవో నంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఆ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.