25.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణరేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. నిరసన

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. నిరసన

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. నిరసన

యదార్థవాది బ్యూరో ములుగు

ములుగు పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేయాలని బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ములుగు జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్. పిలువు మేరకు ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో నేడు ములుగు మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి. దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల యొక్క పరిపాలనా భవనమైనట్టి ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలని బహిరంగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, డిమాండ్ చేశారు. ఒక ఎంపీ హోదాలో ఉండి ఇలా మాట్లాడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా జవాబు చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చేసిన ప్రసంగాన్ని సుమోటోగా తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేసి వారిరువురుని ఎమ్మెల్యే ఎంపీ పదవుల నుండి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు ఎంపీపీలు, జడ్పిటీసీలు, పలు మండలాల మండల అధ్యక్షులు PACs చైర్మన్లు, రైతు సేవా సమితి అధ్యక్షులు, ముఖ్య నాయకులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్