రైతుబంధు జమ..మంత్రి హరీశ్
హైదరాబాద్ 28 డిసంబర్
తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో వేసింది.. యాసంగి పెట్టుబడి సాయం రైతుబంధు జమచేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పదో విడుత రైతుబంధు ద్వారా 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని,తొలిరోజున 1 ఎకరం ఉన్న 21,02,822 మంది రైతులకు అకౌంట్లలో రూ.607.32 కోట్లు జమ చేశాం అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్లో పోస్టు చేశారు.