28.2 C
Hyderabad
Friday, April 25, 2025
హోమ్తెలంగాణరైతుల కోసమే ప్రజా ప్రభుత్వం 

రైతుల కోసమే ప్రజా ప్రభుత్వం 

రైతుల కోసమే ప్రజా ప్రభుత్వం 

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28 : కాంగ్రెస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో తను రైతుల కోసం చేస్తానన్న రైతు రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ రైతు భరోసా పథకాలను పేద బడుగు బలహీన వర్గాల రైతులకు భూమిని నమ్ముకొని జీవిస్తున్న రైతు సోదరులకు అందించడం ఎంతో సంతోషకరమైన విషయం గణతంత్ర దినోత్సవం రోజు  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  రైతు భరోసా కింద తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక్క రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకొని పైలెట్ ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిగా సాగు చేసే భూములకు రైతు భరోసా అందిస్తూ అలాగే ఇందిరమ్మ రైతు భరోసా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లి రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలని నిజమైన జవాబుదారులను చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇంతటి గొప్ప పథకాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఇచ్చిన గ్యారంటీ లన్నీ పూర్తి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు అనంతులశ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మండల పార్టీ అధ్యక్షులు కొంగరి రవి ఆకుల భరత్ మల్లు రామచంద్రారెడ్డి దుబ్బాక పరశరాములు ఐరేని సాయి సత్తు శ్రీనివాసరెడ్డి అనంతుల రాజు మిద్దె  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్