23.8 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణరైల్వే బ్రిడ్జి ప్రారంభించిన:ఎంపీ ధర్మపురి

రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన:ఎంపీ ధర్మపురి

రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన:ఎంపీ ధర్మపురి

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి, గోవింద్ పెట్ గ్రామాలకు వెళ్లే మార్గం లో బ్రిడ్జి ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్..ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో 8 వందల కోట్ల నిధులతో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడితే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 వేల కోట్లతో ప్రతి జిల్లాలో రైల్వే బ్రిడ్జి పని చేయడం జరిగిందని, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 67 కోట్ల వ్యాయామంతో శరవేగంగా రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ప్రజల సౌకర్యార్థం అనతి కాలంలోనే పెండింగ్లో ఉన్న మరో మూడు బ్రిడ్జిలు కూడా త్వరితగతిన పూర్తి చేసి మరో రెండు నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనుల విషయంలో కూడా కేంద్రం చూపుతున్న చొరవ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సిబ్బంది, జిల్లా బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్