లీకు ద్రోహులను శిక్షించాలి
నిరుద్యోగులకు న్యాయం చేయాలి
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
హుస్నాబాద్ లో కేటీఆర్ దిస్తి బొమ్మ దహనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల చిత్రపటాలను దహనం చేశారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ను విధుల నుండి తొలగించి, టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవిత కోసం రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసి మంత్రులందరూ ఢిల్లీకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.