లేక్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కరీంనగర్ యదార్థవాది
కరీంనగర్ పోలిస్ కమిషనరేట్ లో లేక్ అవుట్ పోస్ట్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం దిగువ మానేరు జలాశయం వద్ద లూపిన్ దయాగ్నోష్టిక్స్ వారి సహకారం తో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా సందర్శకులు, వాకర్స్, సమీప ప్రాంతాలకు చెందిన వంద మందికి ఉచితంగా మధుమేహం, రక్తపోటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. దీనిలో లూపిన్ దయాగ్నోష్టిక్స్ ఏరియా మేనేజర్ కడివేంది సతీష్ పల్ల, నరేందర్, లేక్ అవుట్ పోస్ట్ రిజర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ అర్షం, సురేష్, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, కానిస్టేబుల్ ఎండి.గౌస్,హోమ్ గార్డ్స్. మునిందర్, చక్రపాణి, స్వచ్చ భారత్ కార్యనిర్వాహకులు రాంప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.